*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు*
*4 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షతో మార్కాపురం నూతన జిల్లా ఏర్పడ్డక మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కు విచ్చేస్తున్నారని టీడీపీ కేడర్ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని వెలుగొండ టన్నెల్ పరిశీలన, 11:30 గంటలకు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, పనుల పరిశీలన కార్యక్రమం, అనంతరం 12 గంటలకు మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డు సాయి బాలాజీ మోడల్ స్కూల్ ఎదురు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు...*
*కావున మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి యర్రగొండపాలెం బాధ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, గూడూరి ఎరిక్షన్ బాబు గారు కార్యాలర్తలందరికి తెలియజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారి పర్యటన లో జిల్లా ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు గురించి తీపి కబురు వినబోతున్నట్లు పల్లా శ్రీనివాస్ గారు తెలిపారు. కావున ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని కోరారు...*
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz