Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు.

0
124

Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు

21-02-2026 Sat 16:37 | Andhra

Chandrababu Condemns Congress Protest at Delhi AI Summit

ఇలాంటి పనులు దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని వ్యాఖ్య

టెక్నాలజీని ప్రజల మేలు కోసమే వినియోగిస్తామన్న ముఖ్యమంత్రి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సులో కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి నిరసన తెలపడం తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేసిందని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ప్రపంచంలోని 60కి పైగా దేశాలు తమ ఆవిష్కరణలతో పాల్గొన్న అంతర్జాతీయ సదస్సులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఈ పనులు దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని స్వాగతించాల్సింది పోయి, ఇలాంటి నిరసనలు చేయడం దారుణమని పేర్కొన్నారు.

 

తాను ఇటీవల ఢిల్లీ ఏఐ సదస్సుకు హాజరయ్యానని, వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినూత్న మార్పులు తీసుకురాబోతోందని వివరించారు. టెక్నాలజీని ప్రజల మేలు కోసం వినియోగించడం తనకు అలవాటని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని తీసుకొచ్చి సాగును సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Rajasthan
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
By BMA ADMIN 2025-05-20 06:47:45 0 2K
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై...
By Pagadala Venkateswar 2026-03-03 11:21:44 0 105
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు
రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి...
By Benguluri Madhubabu 2026-02-24 05:36:47 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com