Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు.

0
159

Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు

21-02-2026 Sat 16:37 | Andhra

Chandrababu Condemns Congress Protest at Delhi AI Summit

ఇలాంటి పనులు దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని వ్యాఖ్య

టెక్నాలజీని ప్రజల మేలు కోసమే వినియోగిస్తామన్న ముఖ్యమంత్రి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సులో కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి నిరసన తెలపడం తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేసిందని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ప్రపంచంలోని 60కి పైగా దేశాలు తమ ఆవిష్కరణలతో పాల్గొన్న అంతర్జాతీయ సదస్సులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఈ పనులు దేశ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని స్వాగతించాల్సింది పోయి, ఇలాంటి నిరసనలు చేయడం దారుణమని పేర్కొన్నారు.

 

తాను ఇటీవల ఢిల్లీ ఏఐ సదస్సుకు హాజరయ్యానని, వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినూత్న మార్పులు తీసుకురాబోతోందని వివరించారు. టెక్నాలజీని ప్రజల మేలు కోసం వినియోగించడం తనకు అలవాటని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని తీసుకొచ్చి సాగును సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Business & Finance
Kerala Logistics and Port Infrastructure Gets Boost
Kerala is strengthening its logistics network through increased investments in ports, logistics...
By Navya Sree 2026-07-06 07:27:26 0 87
Andhra Pradesh
నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.
*బాపట్ల జిల్లా,బాపట్ల:* బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది....
By Vadlamudi NagaVenkat 2026-04-06 11:37:48 0 244
Andhra Pradesh
మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని...
By Pagadala Venkateswar 2026-03-16 10:09:19 0 169
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 2K
Andhra Pradesh
ప్రజలకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం గద్దె రామ్మోహన్ గారు
*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం* *14వ డివిజన్‌లో చేపల వంతెన దగ్గర పర్యటించిన...
By Rajini Kumari 2026-05-08 13:39:09 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com