మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో దోర్నాల ఈనెల 25వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన

0
11

మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన.

 కలెక్టర్ రాజాబాబు వెల్లడి

 దోర్నాల మండలంలో ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు చెట్లు సీఎం కాన్వాయ్ కి అడ్డంకు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామి రెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు ఎస్సీ అబూద్ అలీ, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.( జిల్లా పౌర సంబంధాల అధికారి

Search
Categories
Read More
Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
By Pagadala Venkateswar 2026-01-19 06:57:34 0 73
Telangana
ఫోన్ ట్యాపింగ్ అట్ మల్కాజిగిరి
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్.*.. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..*....
By Vadla Egonda 2025-06-18 19:49:27 0 1K
Andhra Pradesh
బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:46:00 0 18
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com