యువత సన్మార్గంలో పయనించాలి

0
427

జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ శిబిరం తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పూజ శ్రీ బసవలింగ అవధూత మహారాజ్ మాట్లాడుతూ:--- ప్రస్తుతం ఏ రంగం చూసిన యువతదే ప్రధాన పాత్రఉంటుందని, అలాంటి యువత దేవుడు సూచించిన సన్మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. విద్యా,వైద్య,రాజకీయం... ఇలా అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధిని సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని వారిని నిత్యం పూజించాలని, గౌరవించాలని. జూదం,ల్లో మట్కా, గంజాయి, మద్యంల్లోఇలాంటితు చెడు వ్యాసనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేయకుండా ఉండాలని సూచించారు. ముగిసిన తరగతులు.... యోగ సాధానతో అన్ని రోగాలను అధిగమించవచ్చని పూజ శ్రీ బసవలింగ అవధూత పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తగిలి వచ్చారు. శిక్షణ తరగతులు సాగిన ఐదు రోజులపాటు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

                                     రిపోర్టర్: శివాజీ

Search
Categories
Read More
Bharat Aawaz
Happy Teachers' Day | Happy Onam | Happy Milad Un Nabi
Happy Teachers' Day The power to build a society and the wisdom to guide the future lie with...
By Bharat Aawaz 2025-09-05 07:16:51 0 920
Telangana
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ...
By Thativar Shivaji 2026-05-29 16:24:55 0 191
SURAKSHA
Shatrujeet Kapur: A Legacy of Courage and Integrity
Leading with Purpose: An IPS Officer’s Journey to Excellence Introduction: In the...
By Kalaga Sailaja 2026-07-17 05:37:04 0 35
Telangana
​శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
భద్రాచలం:  శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ...
By Lakavath Kiran 2026-03-18 14:57:16 0 587
Andhra Pradesh
ప్రజలకు శుభవార్త
రాష్ట్రములో  మంచి శుభ వార్త రాబోతుంది అవి ఏమిటి అంటే వచ్చే ఉగాది పండుగ నాటికి ఐ దు లక్షల...
By Mobbu Venkatramana 2026-01-20 11:14:51 0 600
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com