అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.

0
467

నేడు గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర గారు మరియు పెనుకొండ నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ నాయకులు..

ఉషశ్రీ చరణ్ గారు మీడియాతో మాట్లాడుతూ..

మాజీమంత్రి అంబటి రాంబాబు గారి నివాసంపై ఇటీవల జరిగిన దాడి, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనం అన్నారు, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థ పై దాడి చేయడం నేరమని ఉషశ్రీచరణ్ గారు స్పష్టం చేశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నారు. అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి ఇంటిపై దాడి చేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది,ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో మరింత ఆగ్రహం వస్తుందని హెచ్చరించారు..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారికి, ఆయన కుటుంబానికి పూర్తి సంఘీభావంగా నిలుస్తుందని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివర వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Like
1
Search
Categories
Read More
Telangana
విద్యుత్ ఆర్టిసన్లకి సంగీభవం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా...
By Avunoori Mahesh 2026-04-12 09:16:07 0 147
Andhra Pradesh
పుంగనూరు: గంగ జాతరలో పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బొమ్మయ్య గారి పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భాట గంగమ్మ...
By Kothuru Murali 2026-06-08 14:00:40 0 63
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-05-23 01:43:53 0 587
Telangana
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
By Bheeshman King 2025-12-23 04:38:28 0 480
Telangana
నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....
నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన....   భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ...
By Gujile Ramu 2026-05-05 16:11:29 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com