* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేయడం, కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో" అంటూ లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకుంది. భర్త శివశంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy