Pawan Kalyan: మనకెందుకులే అనుకోవద్దు... ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుంది: పవన్ కల్యాణ్.

0
190

హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు

 

కేవలం భక్తులుగా కాకుండా ధర్మ సంరక్షకులుగా ఉండాలన్న డిప్యూటీ సీఎం

కులం, ప్రాంతం వేరైనా మన ధర్మం ఒక్కటేనని వ్యాఖ్య

మన విశ్వాసాలను కాపాడుకోవడమంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ

ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుందని, హిందూ దేవుళ్లను, ధర్మాన్ని కించపరిచినప్పుడు మౌనంగా ఉండకుండా తమ గళాన్ని వినిపించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సగటు హిందువు మనస్తత్వంలో మార్పు రావాలని, భయంతో లేదా సౌలభ్యం కోసం మౌనంగా ఉండే ధోరణిని వీడాలని ఆయన సూచించారు. దేవుడిపై భయం, విశ్వాసంపై గౌరవం ఉన్నప్పటికీ, మన ధర్మాన్ని ఎవరైనా దురుద్దేశంతో అపహాస్యం చేసినప్పుడు కేవలం వ్యక్తిగతంగా బాధపడి, కర్మకు వదిలేసి ముందుకు సాగే అలవాటు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను వివరిస్తూ, "మనం కులం, మతం, ప్రాంతం, భాషల పరంగా విభజనకు గురై ఉండవచ్చు. కానీ మనందరి ధర్మం ఒక్కటే, దేవుళ్లు కూడా అంతే. మన విశ్వాసాలను, ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు మన బాధను తెలియజేయడం మనందరి కర్తవ్యం. ఇలాంటి కీలక సమయాల్లో పాటించే మౌనం సమిష్టి చైతన్యాన్ని బలహీనపరుస్తుంది" అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ కేవలం భక్తులుగా మిగిలిపోకుండా, తమ విశ్వాసాలకు స్పృహతో కూడిన సంరక్షకులుగా కూడా వ్యవహరించాలని ఆయన కోరారు.

 

హిందూ ధర్మాన్ని రక్షించుకోవడమంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ సొంత విశ్వాసాలను, సంప్రదాయాలను కాపాడుకోవడం మాత్రమేనని ఆయన వివరించారు. హిందువులు తమ ధార్మిక బాధ్యతను గుర్తించి, సోమరితనం వీడి, తమ విశ్వాసాల పరిరక్షణకు సమిష్టిగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మార్పు ద్వారానే హిందూ ధర్మం యొక్క గౌరవాన్ని కాపాడుకోగలమని ఆయన ట్వీట్

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra pradesh former minister mudragada padbhanam expired
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం...
By G k Nookala 2026-07-14 15:22:58 0 86
SURAKSHA
Mithra T., IAS: Transforming Governance with Vision & Integrity
The Journey begins "Good governance is not about exercising...
By Fathima Safa 2026-07-15 06:23:55 0 73
Andhra Pradesh
చరిత్ రెడ్డి ఢిల్లీలో మిథున్ రెడ్డితో భేటీ: ఎన్నికల వ్యూహాలపై చర్చ.
రామసముద్రం మండలం వైసీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి తనయుడు, యువ నాయకుడు చరిత్ రెడ్డి ఢిల్లీలో వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-04 07:25:16 0 149
Andhra Pradesh
'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత.
  'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత 16-06-2026 Tue  Andhra Crime rate in AP...
By Pagadala Venkateswar 2026-06-16 13:32:29 0 77
Business & Finance
Start Your Partnership Firm with Ease
Build your business with confidence by registering your Partnership Firm through a simple and...
By Navya Sree 2026-07-11 05:49:07 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com