*నంద్యాల కేసు కెనాలకు ఘనంగా జలహారతి* *అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*

0
94

*నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి*

*ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్*

నంద్యాల ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అయిన కేసీ కెనాల్ (కర్నూలు-కడప) కాలువకు బుధవారం ఘనంగా 'జలహారతి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ గారికి పోన్నాపురం కాలనీ వద్ద పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. 19వ వార్డు టీడీపీ ఇంచార్జి షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిరోజ్ గారు కాలువకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండీ ఫిరోజ్ గారు మాట్లాడుతూ నంద్యాల రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించే కేసీ కెనాల్‌కు తగినంత నీరు విడుదల కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, సాగునీటి లభ్యత పెరగడం వల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, బ్యాంకు తిమ్మయ్య, డైరెక్టర్లు మునియార్ ఖలీల్ , ఉప్పరి సురేష్ కుమార్ , కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, బోయ రామకృష్ణ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , చలం బాబు , మిట్నాల రవి , వడ్డే జనార్ధన్, ఖాజా శంకర్, సుబ్బయ్య, జనార్ధన్ ,సాయి రామ్, బద్రి శెట్టి రవి, మాజీ ఎంపీటీసీ జనార్దన్ గౌడ్ ,కెసిపి పుల్లయ్య, విద్యా కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా, కోడూరు శీను, అడ్వకేట్ హరి, వార్డు సెక్రటరీ కాజా శంకర్, టిడిపి సీనియర్ నాయకులు పుట్ట నాగరాజు, గొల్ల రమణ, వెంకటరమణ, నాగేశం, రైటర్ ప్రసాద్ ,యువ నాయకులు సుబ్బు, శ్రీలం శేఖర్ ,

బూత్ ఇంచార్జ్ దివాకర్, షేక్ మూర్తిజ, జనసేన యువ నాయకుడు ఆకాశ రెడ్డి, ధనుంజయ శర్మ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనారు

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 89
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 30
Andhra Pradesh
తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం...
By mahaboob basha 2025-09-09 05:51:18 0 289
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com