స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం

0
74
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ పాఠశాలలో సోమవారం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు, ఎస్ ఐ సురేష్, ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ యాప్ ద్వారా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి సంఘటనలను అరికట్టవచ్చని తెలిపారు.
అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే ఫేక్ న్యూస్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు.
సమస్యలు ఎదురైనప్పుడు 100, 112, 181, 1091, 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం (చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం)పై, అలాగే మహిళల రక్షణకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
 
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.
Search
Categories
Read More
Andhra Pradesh
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం    ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
By Rajini Kumari 2025-12-23 10:00:15 0 84
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డ్రోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డోన్ పట్టణంలో సేవా...
By Hari Krishna 2026-01-23 14:21:57 0 94
Andhra Pradesh
ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఇవాళ్టి కార్యక్రమాలు రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పల్ప అస్వస్థతకు...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:44:49 0 159
Rajasthan
Rajasthan Drought Crisis: State Faces Lowest Rainfall in 50 Years
Historic Drought: Rajasthan is facing a severe drought, with monsoon rainfall being the lowest in...
By Triveni Yarragadda 2025-08-11 14:38:39 0 1K
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com