స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం

0
160
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ పాఠశాలలో సోమవారం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు, ఎస్ ఐ సురేష్, ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ యాప్ ద్వారా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి సంఘటనలను అరికట్టవచ్చని తెలిపారు.
అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే ఫేక్ న్యూస్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు.
సమస్యలు ఎదురైనప్పుడు 100, 112, 181, 1091, 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం (చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం)పై, అలాగే మహిళల రక్షణకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
 
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.
Search
Categories
Read More
Andhra Pradesh
13 ఏళ్ల బాలిక మిస్సింగ్
యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు...
By Kothuru Murali 2026-02-10 07:18:02 1 166
Andhra Pradesh
అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 
అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు!  అమెరికాలోని మేరీల్యాండ్...
By Gadiyapudi Narendra 2026-01-05 17:44:44 0 203
Andhra Pradesh
తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
తమిళనాడు/కృష్ణగిరి/తళి   *తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*...
By Rajini Kumari 2026-04-20 14:29:49 0 82
Andhra Pradesh
రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన
 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ...
By Gadiyapudi Narendra 2026-03-05 05:54:40 0 189
Telangana
పెద్దపల్లి వేసవి ప్రభావాలు అధిక ఉష్ణోగ్రతలు: వేసవిలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు చేరుకుంటాయి. గత ఏడాది సుల్తానాబాద్ వంటి ప్రాంతాల్లో 44.5°C నమోదైంది.
PEDDAPALLI 
By Sunka Santhosh 2026-03-26 05:45:21 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com