స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం

0
163
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ పాఠశాలలో సోమవారం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు, ఎస్ ఐ సురేష్, ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ యాప్ ద్వారా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి సంఘటనలను అరికట్టవచ్చని తెలిపారు.
అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే ఫేక్ న్యూస్‌కు దూరంగా ఉండాలని హితవు పలికారు.
సమస్యలు ఎదురైనప్పుడు 100, 112, 181, 1091, 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం (చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం)పై, అలాగే మహిళల రక్షణకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
 
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.
Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ నాకాబందీ కార్యక్రమం
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 22.12.2025* _*//గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించిన...
By KOTESWARARAO KVSR 2025-12-22 06:04:26 0 209
Andhra Pradesh
Warning ⚠️ to Bookies
ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభు...
By Naveen Kumar 2026-03-28 08:04:18 0 230
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు....
By Kothuru Murali 2026-01-05 13:06:24 0 173
Telangana
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి... కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
By Gangaram Rangagowni 2026-01-24 09:57:13 0 334
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com