Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.

0
152

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట

అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా పేర్కొనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

 

మనీలాండరింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేసిన ఈడీ

ఇటీవలే కేసును మూసివేసిన ఏపీ సీఐడీ

ఇతర నిందితులపై కొనసాగనున్న విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదు. నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టం చేసింది.

 

విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను జనవరి 28న కోర్టు విచారణకు స్వీకరించింది. డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTSPL), దాని ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ (సుమన్ బోస్) తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడీ, చంద్రబాబు ప్రమేయంపై సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఈడీ అధికారిక ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

ఇదే కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆయన 53 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండటం తెలిసిందే. అయితే, గత నెలలోనే ఏపీ సీఐడీ ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు "వాస్తవ దోషం (Mistake of Fact)" అని పేర్కొంటూ విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. కోర్టు దానిని ఆమోదించడంతో సీఐడీ కేసు మూసివేతకు గురైంది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేపట్టిన ఈడీ కూడా ఇప్పుడు చంద్రబాబు పాత్ర లేదని చెప్పడంతో ఆయనకు పూర్తిస్థాయిలో ఊరట లభించినట్లయింది.

 

ఈడీ తాజా నిర్ణయంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇది చంద్రబాబు నిష్కళంక రాజకీయ జీవితానికి లభించిన "గొప్ప నైతిక విజయం" అని అభివర్ణించారు. సత్యం, న్యాయం వైపు నిలబడే నాయకుడు చంద్రబాబు అని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. కాగా, ఈ కేసులో ఇతర నిందితులపై పీఎంఎల్‌ఏ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం ₹54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని దీక్షలు విరమణ కార్యక్రమం మొదటి రోజు
నిజం: భవానీ దీక్ష విరమణ మొదటి రోజు కార్యక్రమాలు              ...
By Rajini Kumari 2025-12-12 17:06:49 0 268
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కార్యాలయంలో మెప్మా SHG మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
*విజ‌య‌వాడ* *22-12-2025*   *ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*...
By Rajini Kumari 2025-12-22 07:22:04 0 182
Andhra Pradesh
మదనపల్లిలో కర్ణాటక యువకుడి పై దాడి.
ఆదివారం మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర(23)పై దాడి జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-18 04:14:04 0 78
Jammu & Kashmir
JKCA Suspends President After Apex Council Vote
The Jammu & Kashmir Cricket Association (JKCA) has suspended its president following an...
By Navya Sree 2026-06-27 07:47:00 0 84
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
*విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు*    ఘాట్ రోడ్డు, మహా...
By Rajini Kumari 2025-12-26 10:07:04 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com