మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|

0
183

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. సెలెక్ట్ టాకీస్ నుండి మచ్చ బొల్లారం వాటర్ ట్యాంక్ వరకు తీవ్రంగా దెబ్బతిన్న బిటి (BT) రోడ్డు అభివృద్ధి పనుల కోసం ₹238 లక్షల నిధులను జిహెచ్ఎంసి(GHMC) స్టాండింగ్ కమిటీ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 

నిరంతర కృషితో నిధుల మంజూరు :

గత ఏడాది ఆగస్టు 2025 లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతుతో, డివిజన్ ల్లోని సీసీ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధిపై జిహెచ్ఎంసి కమిషనర్ కు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ సమగ్ర వినతి పత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనలను సాంకేతిక బృందం పరిశీలించిన అనంతరం, జనవరి 21న జనరల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, జనవరి 29న తుది ఆమోదం తెలిపారు.

సెలెక్ట్ టాకీస్ నుండి వాటర్ ట్యాంక్ వరకు ఉన్న ఈ రహదారి నివాస కాలనీలను కొంపల్లి- బొల్లారం హైవేను మరియు రైల్వే స్టేషన్ ను కలిపే అత్యంత కీలక దారి. రహదారి దెబ్బతినడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిధులు కేటాయించారు.

ఈ అభివృద్ధి పనులకు సహకరించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు, కార్పొరేటర్  రాజ్ జితేంద్రనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం మిగతా ప్రతిపాదనలను కూడా మైనంపల్లి సూచనలతో త్వరలోనే మంజూరు చేయిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Bharat Aawaz
Quantum Computing Jumps from Lab to Enterprise: The Race for Fault Tolerance
After decades in the realm of high physics, quantum computing has entered a critical phase of...
By Venugopal Gopal 2025-12-13 06:34:42 0 429
Andhra Pradesh
*నంద్యాల కేసు కెనాలకు ఘనంగా జలహారతి* *అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*
*నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి* *ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన...
By Chennaiah Kati 2026-02-05 02:22:43 0 225
Telangana
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము  ప్రతి గింజను కొనుగోలు...
By Gujile Ramu 2026-04-27 11:05:15 0 365
Telangana
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్కను టార్గెట్ చేశారా?
గోషి క‌ట్టుకున్న‌వాళ్లంతా వైఎస్ కాలేర‌ని సీఎం రేవంత్ ఎవ‌రిని ఉద్దేశించి...
By Ponnala Srinivasrao 2026-06-07 00:45:23 0 128
SURAKSHA
: గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందన
అంశం: గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి ఘటనపై NHRC స్పందన​విజయవాడలో గడె సాయికృష్ణ కస్టోడియల్ మృతి...
By Kalaga Sailaja 2026-06-27 09:26:03 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com