Chandrababu Naidu: పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.

0
137

డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష

2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని పిలుపు

ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ వినియోగం పెంచాలని సీఎం ఆదేశం

'మన మిత్ర' ద్వారా ఇప్పటివరకు 1.43 కోట్ల మందికి సేవలు

పాలనలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. డేటా ఆధారిత పాలనపై మరింత దృష్టి సారిస్తామని, 2026వ సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సామర్థ్యం లేని ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే అనేక సమస్యలను టెక్నాలజీతో సులభంగా పరిష్కరించవచ్చని అన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) ఏఐ ద్వారా వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

 

'మన మిత్ర' - వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై కూడా సీఎం సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-04 07:45:35 0 123
Andhra Pradesh
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్...
By Boiena Rajesh 2026-03-16 03:50:12 0 147
Media Academy
🌟 BMA Academy: Building Journalists for Tomorrow
🌟 BMA Academy: Building Journalists for Tomorrow At BMA Academy, we don’t just teach; we...
By Media Academy 2025-04-29 08:41:17 0 3K
Andhra Pradesh
అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-04-13 05:35:14 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com