23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

0
141

ప్రకటన

 

విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి" అలంకారం లో దర్శనమిచ్చుట మరియు ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసములు గురించి.

@@@

 

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ, శుక్రవారం నాడు శ్రీ పంచమి (వసంత పంచమి) పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టడమైనది.

 

 చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికె. శీనానాయక్ తెలిపారు.

 

అమ్మవారి అలంకారం:

 

శ్రీ పంచమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారు "శ్రీ సరస్వతీ దేవి" అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్వేత వస్త్రధారిణియై, చేతిలో వీణను ధరించి, పుస్తకము, అక్షరమాలను పట్టుకుని జ్ఞానప్రదాయినిగా అమ్మవారు అటు ప్రధాన ఆలయంలోను, ఇటు మహా మండపం 6వ అంతస్తులో భక్తులను అనుగ్రహించనున్నారు.

 ఉదయం నుండే భక్తులు ఈ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు.

 

సామూహిక అక్షరాభ్యాసములు:

చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడానికి శ్రీ పంచమి అత్యంత ప్రశస్తమైన రోజు కావడంతో, దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం సామూహిక అక్షరాభ్యాసములు ఏర్పాటు చేశారు.

మల్లికార్జున మహామండపం 6 వ అంతస్తులో 

 ఉదయం 07:00 గంటల నుండి ప్రారంభమవుతాయి.

దేవస్థానం యాగశాల లో శ్రీ సరస్వతి యాగం నిర్వహించబడును.

 

 అక్షరాభ్యాసానికి కావలసిన పలక, బలపం మరియు ఇతర పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది.

 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనది. భక్తులకు ఉచిత ప్రసాదం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడింది. వసంత పంచమి రోజున సరస్వతీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

ఈ సందర్బంగా విద్యార్థులకు దేవస్థానం నుండి ఇచ్చుట నిమిత్తం పెన్ను, అమ్మవారి చిత్రం, కుంకుమ తదితరముల ప్యాకింగ్ మహా మండపం 4 వ అంతస్తులో ఫెస్టివల్ సెక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.

 

సదా శ్రీ దుర్గా మల్లేశ్వరుల సేవలో...

 

చైర్మ

న్, కార్యనిర్వహణా ధికారి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు...
By Benguluri Madhubabu 2026-02-02 06:43:13 0 198
Assam
PM Modi Visits Assam, Celebrates Bhupen Hazarika Centenary & Launches Projects
PM #NarendraModi visited #Assam on September 13 for a two-day trip.He attended Dr. Bhupen...
By Pooja Patil 2025-09-13 11:16:37 0 158
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా...
By Ponnala Srinivasrao 2026-03-16 10:47:22 0 190
Bharat Aawaz
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
By Bharat Aawaz 2025-06-25 17:46:56 0 1K
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...
By Benguluri Madhubabu 2026-03-30 11:58:09 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com