Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు.

0
150

Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు

22-01-2026 Thu 07:11 | Andhra

 

Chandrababu calls for natural farming at Davos

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు

ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటన

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగుకు 18 లక్షల మంది రైతులు సిద్ధం

రైతులకు తక్కువ పెట్టుబడి, అధిక ఆదాయంతో పాటు పర్యావరణానికి మేలు అని వివరణ

"ప్రకృతి సాగు చేద్దాం... భూమిని బాగు చేద్దాం" అనే నినాదంతో ఏపీని ప్రపంచ ప్రకృతి వ్యవసాయ పటంలో అగ్రగామిగా నిలబెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా నిన్న‌ జరిగిన "ప్రకృతి సేద్యం-ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తి" అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచ వేదికపై వివరించారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించడం ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

 

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... "ప్రకృతి సేద్యం కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, అది వాతావరణ మార్పులను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధం. ఏపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయ క్షేత్రంగా మారేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది రైతులు దాదాపు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విధానం ద్వారా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. మొదటి ఏడాది నుంచే అధిక నికర ఆదాయం లభించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది" అని వివరించారు.

 

ప్రకృతి వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఎన్నో ప్రయోజనాలు

ప్రకృతి వ్యవసాయం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను కూడా సీఎం నొక్కిచెప్పారు. "ఈ పద్ధతిలో భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నీటి వినియోగం తగ్గడంతో పాటు జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) వృద్ధి చెందుతుంది. భూసారం కూడా పెరుగుతుంది. 'ఫార్మర్ టు ఫార్మర్' పద్ధతిలో అనుభవజ్ఞులైన రైతుల ద్వారా ఇతర రైతులకు శిక్షణ ఇప్పించి, ఈ విధానాన్ని ప్రతి గ్రామానికి విస్తరిస్తున్నాం" అని తెలిపారు.

 

టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామ‌న్న సీఎం

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఉందని చంద్రబాబు వెల్లడించారు. "గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, దీనిని రైతుల కోసం ఒక పెద్ద వ్యాపార అవకాశంగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడమే మా ధ్యేయం" అని ఆయన అన్నారు.

Search
Categories
Read More
Mizoram
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
By Fathima Safa 2026-06-25 04:20:05 0 66
West Bengal
Bengal Revises OBC List Following Calcutta High Court Order
The West Bengal government has officially notified a revised list of 66 Other Backward Classes...
By Dunna Jessicaruth 2026-05-20 10:38:49 0 110
Telangana
సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం.....
By Bheeshman King 2026-04-10 11:27:28 0 214
Andhra Pradesh
(బి ఎల్ ఓ) లకు కలర్ ఫోటోతో కూడిన ఓటర్లు జాబితా అందజేసిన గుంటూరు కలెక్టర్.
 *బిఎల్ఓ లకు కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితా అందజేత* గుంటూరు, డిసెంబర్ 23:- రాష్ట్ర ఎన్నికల...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:36:03 0 224
Andhra Pradesh
నందిగామ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు...
By Patan Khuddus 2026-05-06 11:40:29 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com