Nadendla Manohar: ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.

0
180

ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికే నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వెల్లడి

యంత్రాంగం రాబోయే రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం రైతులకు మరో శుభవార్తను అందించింది. ఇకపై ధాన్యం కొనుగోలు చేసిన రోజే సాయంత్రానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.

 

ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890 కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.9,800 కోట్లను 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. తేమ శాతం, జీపీఎస్, రవాణా వంటి సమస్యలను సమర్థవంతంగా అధిగమించామని పేర్కొన్నారు.

 

రాబోయే రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే, గోతాలు, రవాణా, నిల్వ సౌకర్యాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఢిల్లీరావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక...
By Chennaiah Kati 2026-01-19 16:41:21 0 226
Business & Finance
CMA Report for Faster Business Loan Approvals
A CMA (Credit Monitoring Arrangement) Report is a financial statement prepared to help banks...
By Navya Sree 2026-07-23 05:54:13 0 16
Andhra Pradesh
మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.
మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన...
By Pagadala Venkateswar 2026-01-24 06:11:41 0 168
Andhra Pradesh
బోయకొండ గంగమ్మ ఆలయంలో కోటి రూపాయలకు పైగా హుండీ ఆదాయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో రికార్డు...
By Kothuru Murali 2026-05-18 15:26:56 0 78
Telangana
"సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు...
By Sidhu Maroju 2026-05-19 15:25:22 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com