Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.

0
146

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన

పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు

అతిగా తాగడమే మృతికి కారణమని పోలీసుల నిర్ధారణ

కొన్ని గంటల్లోనే 19 బీర్లు తాగినట్లు గుర్తింపు

సంక్రాంతి పండుగ వేళ అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అతిగా మద్యం సేవించి మృతిచెందారు. ఈ ఘటన కంభంవారిపల్లి మండలం బండవడ్డిపల్లెలో జరిగింది.

 

వివరాల్లోకి వెళితే.. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న మణికుమార్ (35), పుష్పరాజ్ (26) సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చారు. పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ పోటీపడి మద్యం సేవించారు. దీంతో కొద్దిసేపటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

 

ఇది గమనించిన స్నేహితులు వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మొదట కల్తీ మద్యం కారణంగా మరణించారని ఆరోపణలు వచ్చినా, పోలీసులు వాటిని తోసిపుచ్చారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల మధ్య ఇద్దరూ కలిసి 19 బడ్‌వైజర్ టిన్ బీర్లు తాగారని, అతిగా మద్యం తాగడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టమైందని పోలీసులు తెలిపారు.

 

మృతుడు మణికుమార్‌కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కు ఇంకా వివాహం కాలేదు. పండుగ రోజున యువకులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
By Rajini Kumari 2025-12-28 09:42:23 0 235
Andhra Pradesh
అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు
అనంతపురం: అనంతపురం లోని సర్వీస్ రోడ్ లో ఉన్నా నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు ఈ మేరకు...
By Eslavath RameshNaik 2026-01-14 05:05:54 0 234
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 189
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com