విజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

0
180

*పత్రికా ప్రకటన*

*విజయవాడ, తేదీ: 14.01.2026*

 

*• గొల్లపూడిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు*

*• భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించడం

*. తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

*- సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి*

 

 గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో అనిశ్చితి, అవమానాలకు కారణమైన పాత పట్టాదారు పాసుపుస్తకాలను త్యజించి, ప్రభుత్వం రాజముద్రతో జారీ చేస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలను స్వీకరించడం రైతులు ఆనందంతో ఉన్నారన్నారు. భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించే సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. అదే భావంతో రైతులు తమ బాధాకర అనుభవాలకు ముగింపు పలుకుతూ కొత్త నమ్మకం, భరోసాతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు వెళ్లుతుందన్నారు. సంక్రాంతి పండుగకు వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చి పండుగ చేసుకుంటారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలామంది రైతులు పట్టాదారు పుస్తకాల విషయంలో క్షోభ పడ్డారన్నారు. రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు అందిస్తుందన్నారు. రైతులు పాత పట్టాదార్ పాస్ పుస్కకాలను బోగి మంటల్లో వేసి పండుగ జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి పాలనను అందిస్తున్నారన్నారు. ధాన్యం డబ్బులను 24 గంటల్లో రైతు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.. రాష్ట్రంలో యువతీయువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తుందన్నారు. తెలుగు ప్రజల జీవితాల్లోని కష్టాలు భోగి మంటల్లో దగ్దమై, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి వెల్లివెరియాలని ఆకాంక్షించారు.. అందరి మనోభావాలను గతంలో దెబ్బతీసారని.. అలాంటి ఆలోచనలు మంటల్లో కాలిపోవాలని ఆశిస్తున్నానని మంత్రి కొలుసు పార్థసారధి తెలియజేసారు.  

 

శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ శాంతి, సుస్థిరతలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. భోగి మంటల్లో పాత పుస్తకాలను వేసి భోగి పండుగను జరుపుకుంటున్నారన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, ప్రతి కుటుంబంలో పండుగ వెలుగులు నిండాలని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు.

 

ముందుగా గొల్లపూడి వన్ టౌన్ సెంటర్ లో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు కలిసి సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అంగల్లు వద్ద IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు ప్రారంభం. స్మార్ట్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్ నమూనాల ప్రదర్శన.
Madanapalle: ఆధునిక వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన IMFORU...
By Pagadala Venkateswar 2026-07-21 09:54:00 0 35
Telangana
నిజామాబాద్:మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఆకస్మిక తనిఖీ
ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్‌ను సందర్శించి...
By Sadaq Sadaq 2026-07-15 13:48:03 0 71
Andhra Pradesh
వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్
*మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు* *డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-13 12:39:45 0 142
Telangana
మంచిర్యాల: చిన్నారులతో క్రికెట్ ఆడిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా...
By Bonagiri RaviShankar 2026-06-14 13:49:09 0 200
Telangana
తెలంగాణలోని పది జిల్లాల రద్దు ఆలోచనలో ప్రభుత్వం?.|
    హైదరాబాద్ : త్వరలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని అసెంబ్లీలో మంత్రి...
By Sidhu Maroju 2026-01-07 14:41:26 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com