త్వరలో గరుడ పథకం ఏపీలో.

0
80

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. పేద బ్రాహ్మణుల సంక్షేమం, వారికి అండగా నిలిచేందుకు ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే.. సంబంధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నారు. వీటికి నేరుగా అకౌంట్లో జమ చేయనున్నారు. కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే గరుడ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా మొదలైంది. తాజాగా అమరావతిలోని సచివాలయంలో ఈ పథకం విధివిధానాలు, అమలుపై మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ సమావేశమై చర్చించారు. పథకం ఎలా అమలు చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.

Search
Categories
Read More
SURAKSHA
Bengaluru & Chennai: India’s Champions of Women’s Inclusivity!
  Huge news for South India! 🌟 The 2025 "Top Cities for Women in India" (TCWI) report by...
By Venugopal Gopal 2026-01-09 05:01:03 0 1K
Andhra Pradesh
జీవించింది 55 ఏళ్ళు అయినా తరతరాలకు నిలిచిపోయే పేరు రఫీ సాబ్
జీవించింది_55_ఏళ్ళే_అయినా_తరతరాలకు నిలిచి_పోయే_పేరు_రఫీ_సాబ్_ది  ...
By Rajini Kumari 2025-12-24 10:47:11 0 104
Telangana
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
By Thativar Shivaji 2026-02-14 10:50:03 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com