కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్

0
66

*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*

 

  *కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతికుమార్‌*

 

               తెలుగుదేశం పార్టీ ఇన్ని దపాలు అధికారంలోకి వస్తుందంటే దానికి కారణం కార్యకర్త శ్రమేనని, అటువంటి కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్‌ తెలిపారు.

 

               శనివారం ఉదయం అయ్యప్ప నగర్ కిషోర్ ఆర్థోపెడిక్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్న 8వ డివిజన్ కి చెందిన టిడిపి కార్యకర్త రెడపొంగు జై హిందరావును టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చు నిమిత్తం సొంత నిధుల నుంచి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

 

             ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ కోసం చేసిన సేవలను పార్టీ ఎప్పటికీ మరవదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటుందని చెప్పారు. వైకాపా నాయకత్వం మాత్రం కార్యకర్తలను రెచ్చగొట్టి, వారిని ఇబ్బందులకు గురిని జైల్ల పాలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ ప్రజలకు మంచి చేసే స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. వైకాపా పార్టీ రెచ్చగొట్టే రాజకీయాలు, కుట్రలతోనే ముందుకు వెళ్తోందని ఆరోపించారు. తమ పార్టీ వైద్య సహాయం అవసరమైన కార్యకర్తలకు ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వ్యక్తిగతంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు.

 

              ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ, మెరకనపల్లి నాగేశ్వరావు, బద్దురి వీరారెడ్డి, హయత్ ఖాన్ తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు...
By Pagadala Venkateswar 2026-01-06 06:43:25 0 113
Andhra Pradesh
జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన – జిల్లా కలెక్టర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు...
By John Baji 2026-02-11 06:04:43 0 38
Andhra Pradesh
విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను...
By Rajini Kumari 2025-12-16 09:38:25 0 75
Telangana
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
By Sidhu Maroju 2025-06-20 10:14:18 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com