గుంటూరులో న్యాయ- పోలీసు సమన్వయ నేర సమీక్ష సమావేశం జరిగినది.

0
642

 

 

>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.

 

గుంటూరులో న్యాయ–పోలీసు సమన్వయ నేర సమీక్ష సమావేశం గుంటూరు జిల్లాలో న్యాయవ్యవస్థ–పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు న్యాయమూర్తి శ్రీమతి కోలార్ లత అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నేర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లంశెట్టి పవన్ కుమార్ డీఎస్పీ అరవింద్, మూడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIలు), ఏడు సబ్ ఇన్‌స్పెక్టర్లు (SIలు) సహా ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కోలార్ లత గారు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWలు) పై విస్తృతంగా చర్చించారు. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని, ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ఇటీవల అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలు (BNSS)పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, చట్టపరమైన మార్పులను సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో APP గారు నిందితుల రిమాండ్ ప్రక్రియ, అరెస్ట్ కారణాలను నిందితులకు తెలియజేయడం యొక్క ప్రాధాన్యత, BNSS నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అలాగే సుప్రీం కోర్టు తాజా తీర్పు “మెహిర్ రాజేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర” కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అరెస్ట్ మరియు రిమాండ్ సమయంలో పాటించాల్సిన న్యాయ సూత్రాలను వివరించారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రాజీ సాధ్యమైన కేసులను గుర్తించి, లోక్ అదాలత్‌కు సిద్ధం చేయాలని పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా దర్యాప్తు సమయంలో చోటు చేసుకుంటున్న ప్రక్రియాపరమైన లోపాలు, విధానపరమైన లోపాలుపై చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం ద్వారా న్యాయవ్యవస్థ మరియు పోలీసు శాఖల మధ్య సమన్వయం మరింత బలపడిందని, చట్ట అమలు మరింత సమర్థవంతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయ పడ్డారు.

Search
Categories
Read More
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.
తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-04 10:17:18 0 468
Mizoram
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
By Fathima Safa 2026-06-25 04:20:05 0 66
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...
By John Baji 2026-01-02 08:54:12 0 175
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-06 05:25:52 0 230
Telangana
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ...
By Pinnehasan Odela 2026-04-11 16:01:01 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com