మార్క్ఫెడ్ కందుల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల ::

0
187

కర్నూలు : నంద్యాల : డోన్ : ప్యాపిలి : 

ఈ రోజు ప్యాపిలి పట్టణంలో NCCF ఆధ్వర్యంలో ఏ.పీ. మార్క్‌ఫెడ్ నిర్వహించిన కందుల కొనుగోలు సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు *శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి* గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. రైతులు పండించిన కందులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ఉద్దేశంగా ఇటువంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్‌
పార్టీ పేరులో “టీఆర్‌ఎస్‌” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...
By Ponnala Srinivasrao 2026-04-25 05:34:07 0 75
Andhra Pradesh
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న...
By Gadiyapudi Narendra 2025-12-24 13:32:04 0 210
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ......!
విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM... భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున......
By Gujile Ramu 2026-05-11 16:05:16 0 103
Telangana
చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ సంవత్సర వేడుకలు. కాలనీ టూల్ రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్...
By Sidhu Maroju 2025-08-24 15:58:26 0 519
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com