పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 

0
242

పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
చీరాల: రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు., చీరాల మండలం  ఓడరేవు గ్రామం, వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయితీ తుఫాన్ పేటలో ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లను  అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని, అయితే జనవరి 1వ తేదీన జరిగాల్సిన పంపిణీ నూతన సంవత్సరం సెలవు కారణంగా ఒక రోజు ముందుగానే అర్హులకు పెన్షన్లు అందించడం జరుగుతోందన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లును అర్హులకు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతోందన్నారు. కాగా ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా ప్రతి నెలా ఖచ్చితంగా ఒకటవ తేదీనే పెన్షన్లను అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిచడం జరుగుతోందన్నారు. గడిచిన 18నెలల్లో ఇప్పటివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద 677 మందికి రూ.6.58కోట్ల సాయం అందించామని, చీరాల చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అన్నారు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పారదర్శకతకు నిదర్శనమన్నారు. గతంలో సీఎం ఆర్‌ ఎఫ్‌  చెక్కు కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదన్నారు. గత వైసిపి హయాంలో ఒక్కటంటే ఒక్క చెక్కు ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 182
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-20 13:06:15 0 226
Telangana
దండేపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 104 మంది...
By Avunoori Mahesh 2026-06-02 12:15:42 0 135
Andhra Pradesh
పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు...
By Kothuru Murali 2026-05-16 15:48:13 0 89
SURAKSHA
Safe Hubs: How BRISP Reinvents Industrial Security
Rapid industrial growth requires robust protection, and the Baddi Region Industrial Security Plan...
By Lokeshwari Panthadi 2026-07-03 10:37:40 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com