ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్

0
170

 గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra pradesh High Court) కొట్టివేసింది. గ్రూప్ -2 రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం రోజు తీర్పు ఇచ్చింది. 2023 గ్రూప్ -2కు సంబంధించి రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు (AP Group - 2 Notification) చేయాలని పిటిషన్‌లో కోరారు

అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మేరకు రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని.. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయస్థానం అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణను ఆపాలంటూ అప్పట్లోనూ కొంతమంది పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టు నిరాకరించరింది. పరీక్షను నిలిపివేస్తే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడింది. అలాగే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఆధారంగా.. తదుపరి చర్యలన్నీ తమ తీర్పునకు లోబడే ఉంటాయని అప్పట్లో స్పష్టం చేసింది. మరోవైపు గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు 92 వేల 250 మంది అర్హత సాధించారు. అయితే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ మీద కొంతమంది అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన వారిలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు అర్హత సాధించింది ఇద్దరే. దీంతో గ్రూప్ 2 మెయిన్ పరీక్షను ఆపేస్తే మిగతా అర్హులైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటూ మెయిన్ పరీక్షను నిలిపివేసేందుకు ఏపీ హైకోర్టు అప్పట్లో నిరాకరించింది. తాజాగా గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కూడా ఏపీ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో.. గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట లభించనుంది.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ: తక్షణ ఆర్థిక సహాయం అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కుమ్రం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-04 12:12:13 0 248
Telangana
బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...  భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన...
By Gujile Ramu 2026-05-05 02:43:58 0 151
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 230
SURAKSHA
WB Ex-Police: Heroes Without Uniform But With Heart
Yesterday retired WB police officers continue as heroes without uniform. Orphan children got...
By Kalaga Sailaja 2026-07-03 13:26:10 0 51
Telangana
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది ...
By Ponnala Srinivasrao 2026-05-15 02:51:54 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com