నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం

0
207

నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం

ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ మృతి

పల్నాడు జిల్లా: నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లే మార్గమధ్యంలో, పొనుగుపాడు కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

“సూర్యcem” అని రాసి ఉన్న టయోటా ఇన్నోవా క్రిష్టా కారు, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పావులూరు సురేష్ బాబును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వృత్తిరీత్యా Flipkart డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

ప్రమాదానికి కారణమైన ఇన్నోవా క్రిష్టా వాహనం పిడుగురాళ్లకు చెందిన ‘సూర్యcem ’ మేనేజింగ్ డైరెక్టర్ కొత్త చిన్న సుబ్బారావుకు సంబంధించినదిగా గుర్తించారు. 

ప్రమాద సమయంలో వాహన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, రహదారి పరిస్థితులు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో వెలువడాల్సి ఉంది.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....
By Sidhu Maroju 2026-04-02 07:57:24 0 193
Andhra Pradesh
ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (MSZPH Girls School)లో పదో...
By Boya Dasthagiri 2026-05-11 13:33:33 0 111
Andhra Pradesh
ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు
అన్నమయ్య జిల్లా పోలీసులు విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-04 07:16:29 0 211
Telangana
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న...
By Mittapelli Saketh 2026-02-17 10:12:47 0 266
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com