ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*

0
131

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని అవార్డు 2024 -2025 సంవత్సరముకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన డాక్టర్ గార్లపాటి నందకిషోర్ కు లభించింది. ఈ అవార్డును గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించిన ఐ.ఎం.ఏ జాతీయ సదస్సు లో ఏర్పాటుచేసిన అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమంలో... గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి, రాజ్యసభ సభ్యులు మాన్య నాయక్, ఐ.ఎం.ఏ జాతీయఅధ్యక్షులు డాక్టర్ దిలీప్ బన్సాలి ,జాతీయ కార్యదర్శి సర్బరీ దత్త తదితరులసమక్షంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైయ్ షా

చేతుల మీదగా డాక్టర్ నందకిషోర్ అందుకున్నారు. 2024 -2025 సంవత్సరంలో అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వైద్యులను అనేక సమాజ హిత విషయాలలో చైతన్య పరిచినందుకు , వైద్యుల, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసినందుకు గాను ఈ అవార్డు లభించిందన్న విషయం తెలిసిందే. డాక్టర్ నందకిషోర్ అవార్డు ప్రధానో త్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖకు చెందిన ఐ.ఎం.ఏ పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సమరం ,రాష్ట్రపూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరాజు, ప్రస్తుతఅధ్యక్షులు డాక్టర్ ఎస్. బాలరాజు, ఏ.పీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు ,ఐఎంఏ పూర్వ కార్యదర్శి డాక్టర్ పి. ఫణిదర్ ఐ.ఎం.ఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి. సేవకుమార్, ఐఎంఏ సిజిపి రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి డాక్టర్ ఎం .వి.వి.మురళీమోహన్, డాక్టర్ వి. మహేష్, డాక్టర్ డి. భరత్ కుమార్ లతో పాటు దేశవ్యాప్తంగా విచ్చేసిన 2000 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 1K
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ...
By Kothuru Murali 2026-04-05 07:18:29 0 75
Andhra Pradesh
Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.
2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం   ప్రధాన...
By Pagadala Venkateswar 2026-01-30 05:55:17 0 144
Telangana
కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ...
By Sidhu Maroju 2025-12-20 11:33:51 0 166
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com