దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు

0
232

తుమ్మలపల్లి 

 *25-12-2025*

 

 *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు* 

 

గతంలో రోడ్డు వెడల్పు కోసం తొలగించిన బస్ షెల్టర్కు తిరిగి *నూతన షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ గారి కుమారుడు కృష్ణమోహన్* .

 

ఈరోజు తుమ్మలపల్లి గ్రామంతో పాటు సుమారు చుట్టూ గ్రామాలు అయిన కొమరగిరిపట్నం, ఓడలరేవు, తుమ్మలపల్లి గ్రామంలో పేదలు అయిన వృద్దులు, వితంతవులు అయినవారికి ఈరోజు తుమ్మలపల్లి గ్రామంలో పుట్టిన డాక్టర్ పరమట నరసింహామూర్తి గారు మరియు వారి రెండవ కుమారుడు కృష్ణమోహన్ గారు ఈరోజు అందరికీ రగ్గులు (చలి కాలంలో కప్పుకునే దుప్పట్లు ) నేరుగా వారి ఇళ్లకు వెళ్లి నేరుగా వారికి ఇవ్వటం జరిగింది ఈ సందర్బంగా వారి కుమారుడు కృష్ణ మోహన్అం మాట్లాడుతూ నాన్నగారు నరసింహామూర్తి గారి బాటలోనే నేను కూడా సేవా కార్యక్రమం లో పాల్గొవటం సంతోషం గా ఉందని అన్నారు. తుమ్మలపల్లి గ్రామానికి ఇప్పటివరకూ అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించమని భవిష్యత్తు లో కూడా గ్రామానికి కావలసిన అనేక అవసరాలకు తగ్గట్టు గా అందుబాటులో కి తేవడమే లక్ష్యం అని తెలిపారు త్వరలో నాన్నగారి పేరిట ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు దాని పేరు *Dr. PNM చారిటబుల్ ట్రస్టు* అని ఇక భవిష్యత్తే కార్యక్రమాలు ఆపేరుతో కోనసాగుతాయని కృష్ణమోహన్ తెలిపారు. అంతే కాకుండా గతంలో తుమ్మలపల్లి గ్రామంలో బస్ షెల్టర్ వారి తల్లితండ్రులు పేరిట నిర్మించిన బస్ షెల్టర్ రోడ్డు పెంపుదల సందర్బంగా తొలిగించిన ప్లేస్ లో మళ్ళీ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ షెల్టర్ నిర్మాణానికి సుమారు 3. 5 లక్షలు ఖర్చు. డాక్టర్ గారు గ్రామానికి ఎదో చెయ్యాలి అనే దృఢ సంకల్పం అయన వయసు కూడా తెలియనియదు. అందుకే గ్రామంలో యువత పదుల సంఖ్యలో కూడా అయన వెంటే ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు బస్ షెల్టర్ శంకుస్థాపన కార్యక్రమం లో కాట్రూ శాంతి కిరణ్, మచ్చా సత్యనారాయణ, వుల్లూరి నాని, కుంచె రాజశేఖర్, యలమంచిలి రమేష్ బాబూ, మాకే లోకేష్, పోలామూరి శ్రీనివాస్, కుంచె మహేష్, నాతి సూర్యనారాయణ, పులుసుగంటి శ్రీనివాస్ లతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 2K
Andhra Pradesh
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-06 12:27:27 0 162
Andhra Pradesh
గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక...
By Pagadala Venkateswar 2026-02-19 10:32:42 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com