తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*

0
139

*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వే శాఖకు కేటాయించినందుకు మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.* 

 

 *గిరిజన జిల్లా అయిన మహాబూబాబాద్ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని,కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఫ్లాంట్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేయాలని,రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని అఖిల పక్ష నాయకులు కోరారు.* 

 

 *ఈ ప్రాజెక్టు వల్ల మహాబూబాబాద్ లో రైల్వే అభివృద్ధి కావడమే కాకుండా స్థానిక ప్రజలకు,యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేయడం జరిగింది.* 

 

 *ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అఖిలపక్ష నాయకులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
హిందూ సమ్మేళనం ఓదివేడు
ఈరోజు ఓదివీడు హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంబాత్రేయ క్షేత్రం  పీఠాధిపతి ఘనంగా...
By Benguluri Madhubabu 2026-01-14 06:53:51 0 230
Andhra Pradesh
సరూర్ ఏ ఉర్దూ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్
    ఉర్దూ భాష‌ను వృద్ధిలోకి తీసువ‌చ్చింది సీఎం చంద్ర‌బాబు ఒక్క‌డే...
By Rajini Kumari 2025-12-30 09:58:47 0 71
Andhra Pradesh
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...
By John Baji 2025-12-27 12:10:17 0 82
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com