తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*

0
188

*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వే శాఖకు కేటాయించినందుకు మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.* 

 

 *గిరిజన జిల్లా అయిన మహాబూబాబాద్ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని,కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఫ్లాంట్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేయాలని,రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని అఖిల పక్ష నాయకులు కోరారు.* 

 

 *ఈ ప్రాజెక్టు వల్ల మహాబూబాబాద్ లో రైల్వే అభివృద్ధి కావడమే కాకుండా స్థానిక ప్రజలకు,యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేయడం జరిగింది.* 

 

 *ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అఖిలపక్ష నాయకులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 109
Andhra Pradesh
తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌...
By Rajini Kumari 2025-12-18 07:40:24 0 126
Andhra Pradesh
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
By Kothuru Murali 2026-03-13 08:57:48 0 92
Andhra Pradesh
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
By Bhesetti Lovaraju 2026-01-29 13:22:43 0 271
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com