నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది

0
136

నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం కల్గిస్తూ, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నఆవులను, ఎద్దులను 3 బృందాల ద్వారా గోశాలకు తరలించడం జరుగుతుందని, తరలించిన వాటిని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి ఇవ్వబడవని, తరలింపుని అడ్డుకుంటే పోలీసు కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద ఆవులు విచ్చలవిడిగా వదులుతున్నారని, దాని వలన రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆవుల యజమానులకు రోడ్ల మీదకు వదలవద్దని తెలిపినా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముద్రలు ఉన్న, పెంపుడు ఆవులైనా రోడ్ మీదకు వస్తే జిఎంసి గోశాలకు తరలిస్తామన్నారు. తరలించిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. ఆవులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, బృందాలలో పోలీసులు కూడా ఉంటారన్నారు. ఆవులను పట్టుకోవడంను వీడియో రికార్డింగ్ చేస్తామని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిఎంసి గోశాలలో కూడా అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని షిఫ్ట్ ల వారీగా పెంచాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. గోశాలని ప్రజారోగ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తాము కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఎస్ అయూబ్ ఖాన్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :
సికింద్రాబాద్/సికింద్రాబాద్. సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం...
By Sidhu Maroju 2025-07-26 08:15:12 0 788
Andhra Pradesh
పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
మీడియా పాయింట్...  పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..   ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-14 15:05:42 0 67
Andhra Pradesh
మదనపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం ఓ మహిళ మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది....
By Pagadala Venkateswar 2026-02-14 12:47:08 0 26
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ 24-12-2025   ప్రచురణార్థం   *సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:01:13 0 171
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com