నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది

0
361

నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం కల్గిస్తూ, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నఆవులను, ఎద్దులను 3 బృందాల ద్వారా గోశాలకు తరలించడం జరుగుతుందని, తరలించిన వాటిని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి ఇవ్వబడవని, తరలింపుని అడ్డుకుంటే పోలీసు కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద ఆవులు విచ్చలవిడిగా వదులుతున్నారని, దాని వలన రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆవుల యజమానులకు రోడ్ల మీదకు వదలవద్దని తెలిపినా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముద్రలు ఉన్న, పెంపుడు ఆవులైనా రోడ్ మీదకు వస్తే జిఎంసి గోశాలకు తరలిస్తామన్నారు. తరలించిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. ఆవులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, బృందాలలో పోలీసులు కూడా ఉంటారన్నారు. ఆవులను పట్టుకోవడంను వీడియో రికార్డింగ్ చేస్తామని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిఎంసి గోశాలలో కూడా అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని షిఫ్ట్ ల వారీగా పెంచాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. గోశాలని ప్రజారోగ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తాము కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఎస్ అయూబ్ ఖాన్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Goa MSME Sector Receives Fresh Growth Support
Goa's micro, small, and medium enterprises (MSMEs) are benefiting from improved access to...
By Navya Sree 2026-07-06 07:55:26 0 112
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులను ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు.
ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్...
By Kothuru Murali 2026-07-11 16:08:45 0 75
Andhra Pradesh
AP SSC Exams: ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల.
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు...
By Pagadala Venkateswar 2026-03-17 13:01:55 0 172
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 199
Punjab
Punjab’s Big Push for Early Childhood Development: 1,419 New Anganwadi Centres, Tech Integration, and More
Chandigarh:  The Punjab government, under the leadership of Chief Minister Bhagwant Singh...
By BMA ADMIN 2025-05-20 08:10:58 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com