స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
86

*అనకాపల్లి*

 

• స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

• పారిశ్రామిక కార్మికులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.

• ముఖ్యమంత్రితో కలిసి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో పాల్గొన్న మంత్రి నారాయణ, కొల్లు రవీంద్ర, కొణతాల రామకృష్ణ సహా ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, అధికారులు.

• పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించిన సీఎం చంద్రబాబు.

• పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజల నుంచి సహకారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

• ఇంట్లో పనికి రాని వస్తువులను తీసుకుని నిత్యావసరాలు ఇచ్చే స్వచ్ఛ రథాన్ని పరిశీలించిన సీఎం

• స్వచ్ఛ రథాలు ఉపయోగపడుతున్నాయా అని స్థానికులు అడిగిన ముఖ్యమంత్రి.

• కంపోస్ట్ తయారీ యార్డ్ సందర్శించిన సీఎం చంద్రబాబు.

• చెత్తను కాంపోస్ట్ గా తయారీ చేసి రైతులకు ఎరువులను 

• అందిస్తున్న కంపోస్ట్ యూనిట్ నిర్వాహాకుడు.

• కంపోస్ట్ యూనిట్ ద్వారా అందించే ఎరువులు రైతులకు ఉపయోగపడుతున్నాయా అని ఓ రైతును అడిగి తెలుసుకున్న సీఎం... దిగుబడి కూడా పెరిగిందని చెప్పిన స్థానిక రైతు.

• అనంతరం ప్రజా వేదికలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

• పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించిన విద్యార్థులు.

• ఉత్తమ తీరు కనబర్చిన పారిశుధ్య కార్మికులను సత్కరించి మొమెంటోలు అందించిన సీఎం చంద్రబాబు 

• సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ నిర్వహించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎస్వీడబ్ల్యూతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, 

• పంచాయతీరాజ్, సెర్ప్ మధ్య సీఎం సమక్షంలో ఎంఓయూ 

 

*అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....*

• దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోంది.

• ప్రజల భాగస్వాములతో ఏ కార్యక్రమం చేసినా అది శాశ్వతంగా ఉంటుంది... ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. 

• పరిసరాల పరిశుభ్రతే కాదు...ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి

• ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపించేది పారిశుధ్య కార్మికులే...వారికి కృతజ్ఞతలు తెలపాలి

• సర్క్యులర్ ఎకానమీ పాలసీ తెచ్చి రీ సైక్లింగ్ చేపట్టాం.

• కార్మికులు ఇళ్ల వద్ద చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. ప్రజలు వేర్వేరుగా చెత్తను అందిస్తున్నారని తెలిపారు.

• ఇది బలవంత కార్యక్రమం కాదు.. భావితరాల కోసం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి

• స్వచ్ఛ రథాలు తీసుకొచ్చాం. ప్లాస్టిక్, బాటిళ్లు వంటి వాటిని తీసుకుని వాటికి విలువకు సరిపడా సరుకులు అందిస్తున్నారు.

• వేస్ట్ నుంచి సంపద కలుగుతోంది...ఇది చాలా సంతోషం

• చెత్తను కంపోస్ట్ గా తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు.

• గతంలో ఎక్కువ రసాయనాలు వాడే రైతులు... ఇప్పుడు కంపోస్ట్ ఎరువులు వాడుతున్నామని రైతులు చెప్తున్నారు

• పారిశుధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సేవకులు. వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం.

• స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణా:ద్ర సాకారం కాదు. అందుకే వారికి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నాం.

• మీకు ఒక పిలుపు ఇస్తున్నా....175 నియోజకవర్గాల్లో జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం

• రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ నివారించాం.

• గత ప్రభుత్వం 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చింది.

• జనవరి 26కు రోడ్డుపై వేస్ట్ అనేది కనబడకుండా టార్గెట్ పెట్టుకున్నాం. 

• ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా పొడిచెత్తను సేకరిస్తున్నాం. వీటి సంఖ్య 100కు త్వరలోనే పెంచి మరిన్ని అందుబాటులోకి తెస్తాం

• పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్టుగా పెట్టుకున్నాం... ఇది 3.91 లక్షల ఇళ్లలో ఇది జరుగుతోంది.

• అలాగే రూరల్ ప్రాంతంలో 10 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే... 3.30 లక్షల ఇళ్లల్లో చేస్తున్నాం.

• మార్చి 26 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.

• ఇంటి వద్దే కూరగాయలు పండించుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.

• ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాల్సిందే. 

• అన్ని గ్రామాలు ఓడీఎఫ్ గా ఉండాలి. మరుగుడొడ్లు కట్టుకుని వినియోగించుకోవాలి.

• గతంలో నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాను...కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నా.

• కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్ లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారంచుడుతున్నాం

• ప్రభుత్వ సేవలు ఎంత వేగంగా ప్రజలకు అందించడం, డబ్బులు అడగకుండా సేవలు అందిస్తాం

• పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతాం. 

• నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని ప్రజలకు మాటిచ్చాం... సూపర్ 6 అమలు చేసి మీ రుణం తీర్చుకున్నాం.

Search
Categories
Read More
Andhra Pradesh
మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం
  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం...
By Mobbu Venkatramana 2026-01-24 08:29:30 0 413
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 27
Andhra Pradesh
పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.
పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి...
By Kothuru Murali 2026-01-21 09:46:05 0 64
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి
*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల...
By Rajini Kumari 2025-12-24 10:39:42 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com