మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన

0
53

ప్రచురణార్థం 14/12/25

సింగ్ నగర్ 

 

మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ కార్యక్రమాలకు ఇవ్వకూడదని 

 

మాకినేని బసవపునయ్య అభివృద్ధి కమిటీ క్రీడాకారులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం క్రీడాకారులు వాకర్స్ స్థానికులు అందరూ కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది 

 

నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి డి వై ఎఫ్ ఐ విజయవాడ సెంట్రల్ సిటీ కార్యదర్శి

 ఎస్ కె నిజాముద్దీన్ 

మాట్లాడుతూ

విజయవాడ

సింగ్ నగర్ పాయకాపురం యువజనులు మహిళలు విద్యార్థులు వృద్ధులకు 

అందరికీ

ఉపయోగపడాలని స్టేడియం నిర్మాణం చేశారు 

ప్రైవేట్ కార్యక్రమాలకు ఇచ్చి స్టేడియం అంతా గోతులమయం చేశారు

గోతులను పూడ్చి గ్రౌండ్ బాగా చేసి ఇతర సౌకర్యాలు కల్పించాల్సింది పోయి

 

 ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని పాలకవర్గం చూస్తుందని ఇది సరికాదు 

 

 స్టేడియంలో వాకర్స్ క్రీడాకారులు రోజుకు 1000 నుండి3000 మంది వరకు ఉపయోగించుకుంటున్నారు

పాత పద్ధతిలోనే అందరూ బహుముఖంగా ఉపయోగ ఉపయోగించుకునేటట్లుగానే ఉండాలని అన్నారు

 

  స్టేడియం నిర్మాణం కమ్యూనిస్టుల పాలనలో నిర్మించారని ఆనాడే ఈ ప్రాంతం విస్తరించే ప్రాంతంగా కమ్యూనిస్టులు గుర్తించి స్టేడియాన్ని ఆనాడు నిర్మించారు

 

 స్టేడియం క్రీడాకారులు ప్రజలందరికీ దేహదారుధ్యాన్ని పెంచుకునేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామ కేంద్రంగా స్టేడియం ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు 

 

సేవా కేంద్రాలకు ఆదాయ వనరులుగా మార్చుకునే వీలుగా పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు 

ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రైవేటు కరించే విధానాలను స్వస్తి పలికించాలని 

 ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో మెరుగు పర్చాలి 

 

 గ్రౌండ్ మెరక పోసి లెవలింగ్ చేయించి వాకింగ్ ట్రాక్ వేయించాలని 

 

గ్రౌండ్ చుట్టూ మినరల్ వాటర్ ట్యాపులు ఏర్పాటు చేయించాలి 

 

వివిధ ఆటలకు కోర్టులు ఏర్పాటు చేసి పోల్స్ కొత్తవి వేయించాలని కోరారు

 

నిజాముద్దీన్ తోపాటు

  డివైఎఫ్ఐ నాయకులు ఎస్ కె రసూల్.

 ఎస్ మల్లేశ్వరరావు శ్యామ్. శ్రీను సునీల్ భాస్కర్ ఆనంద్ షకీర్ క్రాంతి చక్రి క్రాంతి రమేష్ అశోక్

 క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

ఇట్లు

ఎస్ కె నిజాముద్దీన్

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com