డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు !!

0
256

కర్నూలు !!

  రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...  జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు

2025 జనవరి నుండి డిసెంబర్ 11 వ తేది వరకు  8,787  డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు  తెలిపారు. 

 రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.

మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని  పోలీసులు  డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. 

మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు ఈ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. 

అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేస్తున్నారు. 

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను కూడా కట్టుదిట్టం చేశారు.

 రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు రోజూ క్రమం తప్పకుండా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు  తెలిపారు.

ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు  , 1 నెల రోజుల పాటు జైలు శిక్ష ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. 


Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు...
By Gadiyapudi Narendra 2026-01-07 13:49:34 0 168
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు...
By Hari Krishna 2025-12-15 11:41:52 0 218
Andhra Pradesh
పుంగనూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.
చౌడేపల్లి మండలం, బాగేపల్లి గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా రామచంద్ర (46) అనే వ్యక్తి మంగళవారం...
By Kothuru Murali 2026-01-28 08:54:57 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com