రుతుపవనాలు ప్రభావంతో ఏపీలో ముంచెత్తే వర్షాలు. |

0
51

ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు మరియు రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 పై వాతావరణ స్థాయిలో ఏర్పడిన త్రఫ్ ప్రభావంతో ఈ వర్షాలు సంభవిస్తున్నాయి. 

 ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మెరుపులు, ఈదురు గాలులు నమోదయ్యే అవకాశం ఉంది. APSDMA ప్రకారం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ తీగల దగ్గర, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని సూచించారు. 

రాత్రి సమయంలో వాతావరణం వేగంగా మారే అవకాశం ఉన్నందున, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com