తంబాకు రహిత యువత కోసం కేంద్రం నూతన ప్రచారం . |

0
40

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా "Tobacco Free Youth Campaign 3.0" ను ప్రారంభించాయి.   

ఈ 60-రోజుల జాతీయ ప్రచారం ద్వారా విద్యా సంస్థల్లో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం, యువతలో తంబాకు వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా ఉంది.   

GYTS-2019 ప్రకారం, 13–15 ఏళ్ల విద్యార్థుల్లో 8.4% మంది తంబాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని వెల్లడైంది. ఈ ప్రచారంలో స్కూల్ చాలెంజ్, మైగోవ్ క్విజ్, 100-యార్డ్ తంబాకు రహిత జోన్‌లు, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు కౌన్సిలింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. 

 ఇది Viksit Bharat@2047 దిశగా ఆరోగ్యవంతమైన యువతను తీర్చిదిద్దే ప్రయత్నం.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com