లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం

0
43

ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవ వేడుకలు ... కరీంనగర్ సీతారాంపూర్‌లోని (సీబీఎస్ఈ) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వైభవంగా ముగిసింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా నిర్వహించిన ఈ నేత్ర శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పసుల మహేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం విద్యార్థులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ ఉచిత నేత్ర పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణం అసెంబ్లీ ప్రాంగణంలో జూలై 22 జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేడ్–3 నుండి గ్రేడ్–9 వరకు విద్యార్థులకు జాతీయ పతాకం గొప్పతనం తెలియజేసే ఉద్దేశంతో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలను పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శివకాంత్ రెడ్డి (ప్రెసిడెంట్), బట్టు వినోద్ (సెక్రటరీ), మెతుకు కృష్ణ చైతన్య, పాఠశాల చైర్మన్ పసుల మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు మెమొంటోలు ( జ్ఞాపికలు ) అందజేశారు . అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ అందజేశారు .ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల సృజనాత్మకత ,ఆత్మవిశ్వాసం పెరుగుతుందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు .

Search
Categories
Read More
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Telangana
సమస్యల పరిష్కార దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2025-12-21 09:01:07 0 199
Telangana
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం...
By Chunarkar Jagadeesh 2026-05-25 16:21:13 0 472
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 158
SURAKSHA
Architect of Governance: The Exemplary Journey of Vineet Garg, IAS
A Visionary Leader Reshaping Public Service in Haryana: In the complex machinery of Indian...
By Kalaga Sailaja 2026-07-17 08:23:53 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com