సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి

0
44

మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ( CITU ) ఆధ్వర్యంలో సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిఈఓ కార్యాలయం సుపర్డెంట్ వేణు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *అబ్బోజు రమణ దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు* మాట్లాడుతూ.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం వంట చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను పాఠశాలల నుండి వెళ్లగొట్టడానికి,విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ,గత సం,,ఈ పథకాన్ని హనుమకొండ జిల్లాలో ప్రవేశపెట్టారు.ఈ పథకం నిర్వాహకులు పెట్టేటువంటి భోజనం రుచికరంగా లేదని, నాణ్యతగా లేదని విద్యార్థులు తినలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. *దాగం రాజారాం* మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ... కనీస వేతన ఇవ్వకుండా కార్మికుల తోటి వెట్టిచాగరి చేయించుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు 10,000/- వేతనం ఇవ్వాలన్నారు.

ఎండి.రఫియా, ఎండి కరీమా* తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ..60 సం,లు వయసు పైబడిన కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదన్నారు. అలా తొలగించే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డుమెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయల చెల్లించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు , స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని యధావిధిగా కార్మికుల ద్వారానే కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోమస ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్ , అంబటి లక్ష్మణ్ , మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం లక్ష్మి, సరిత, ఉమా, రమాదేవి, సవిత, కాంతమ్మ, సేపూరి లక్ష్మి, బుచ్చమ్మ, వరలక్ష్మి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
By Karapati Gopi 2026-06-20 10:16:38 0 241
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*   *ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
By Rajini Kumari 2025-12-15 07:41:35 0 210
Telangana
#భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:01:21 0 821
Andhra Pradesh
జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని,...
By John Baji 2025-12-31 09:11:26 0 190
Andhra Pradesh
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA.
మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం సహాయ నిధి (CMRF)...
By Pagadala Venkateswar 2026-05-26 05:41:55 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com