రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం: వృద్ధుడి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ (రెబ్బెన): కేవలం టీ, మద్యం తాగేందుకు ఇరవై రూపాయలు ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో ఒక వృద్ధుడిని భార్యాకూతుళ్ల కళ్లెదుటే గొడ్డలితో తలనరికి కిరాతకంగా చంపిన అమానుష ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.అసలేం జరిగింది?ఆసిఫాబాద్ మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడి సోమయ్య (65) అనే వృద్ధ రైతు, హైదరాబాద్ నుండి వచ్చిన తన కుమార్తె లక్ష్మిని రైలు ఎక్కించడానికి తన భార్య కరుణాబాయి, చిన్న కుమార్తె సుజాతలతో కలిసి రెబ్బెన రైల్వే స్టేషన్కు వెళ్లారు. శుక్రవారం ఉదయం వారు స్టేషన్ నుండి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, మార్గమధ్యంలో తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్ అనే స్థానిక ఉన్మాది వారిని అడ్డుకున్నాడు. చాయ్, మద్యం తాగేందుకు తనకు ₹20 రూపాయలు ఇవ్వాలని సోమయ్యను డిమాండ్ చేయగా, ఆయన నిరాకరించి ముందుకు సాగారు.కళ్లెదుటే కిరాతకం డబ్బులు ఇవ్వలేదనే తీవ్ర ఆగ్రహానికి గురైన నగేష్, రోడ్డు పక్కన చెట్ల పొదల్లో భార్యాకూతుళ్లు చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో సోమయ్య మెడపై బలంగా వేటు వేశాడు. ఈ ఘాతుకానికి సోమయ్య తల మొండెం నుండి వేరుపడి ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు. భార్యాకూతుళ్లు భయంతో అరుస్తున్నా వినకుండా, నిందితుడు సమీపంలోని నీటి మడుగులో రక్తపు గొడ్డలిని కడుక్కుని అక్కడి నుండి పారిపోయాడు.పోలీసుల వేట తక్షణ చర్యలు ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఆసిఫాబాద్ డీఎస్పీ, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్ఐ వెంకటకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో కీలక ఆధారాలు సేకరించి, నిందితుడు బోగారపు నగేష్ను పోలీసులు క్షణాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘాతుకంపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం అత్యంత కఠినమైన హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz