*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*

0
46

*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ నమోదు ప్రారంభం..* BHARAT AWAZ * సిరిసిల్ల: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే హెచ్-143 ప్రధాన లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా స్పష్టం చేశారు. వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిగత గౌరవాన్ని కాపాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతోందన్నారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుని, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినట్లు గుర్తుచేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సాధన కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమకాలీన సమాజంలో జర్నలిస్టులకు వృత్తిపరమైన సవాళ్లు పెరుగుతున్నాయని, ఇలాంటి తరుణంలో సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ జర్నలిస్టుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు.

Search
Categories
Read More
Telangana
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...
By Sidhu Maroju 2026-01-15 14:28:14 0 242
Telangana
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|
● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 :...
By Sidhu Maroju 2026-07-20 17:34:15 0 72
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-11 03:13:37 0 168
Telangana
సైకిల్ పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే
భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18   ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై...
By Pindikura Mahesh 2026-05-18 03:12:10 0 347
Telangana
63 ఏళ్ల వయసులో కొడుకు భార్యతో సంబంధం.. ఇద్దరూ కలిసి అతడ్ని..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసు వెనుక భయానక...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:21:26 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com