Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0
42

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాలూకా సీఐ కళా వెంకటరమణ సోమవారం మీడియాకు వెల్లడించారు.

 

సీఐ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ రామిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, ఎం. సుధాకర్‌లు పొన్నేటిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని రామిరెడ్డిగారిపల్లె శివారులో సర్వే నంబర్ 360లో ఉన్న 3,300 చదరపు అడుగుల (55×60) ఇంటి స్థలాన్ని 2023లో స్థానిక నక్కలదిన్నెకు చెందిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ దేవేంద్రకు రూ.11.15 లక్షలకు విక్రయించారు.

 

అయితే అదే స్థలాన్ని ఇప్పటికే 2014, 2020 సంవత్సరాల్లో ఇతరులకు విక్రయించి వారి నుంచి కూడా నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధితుడు దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)కు అనుగుణంగా మోసానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 227
Telangana
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక...
By Sidhu Maroju 2026-05-21 17:43:08 0 316
Andhra Pradesh
Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
Andhra Case Filed Against Vidadala Rajani గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత రజనితో...
By Pagadala Venkateswar 2026-02-03 08:39:26 0 143
Andhra Pradesh
ఆటలతో ఉద్యోగులలో మానసిక స్థైరం: కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-10 13:55:51 0 227
Andhra Pradesh
శ్రీకాకుళం: 'దళిత వ్యతిరేక తీర్పులను అడ్డుకోవాలి'
కులాంతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య గారు శ్రీకాకుళంలో జరిగిన కార్యవర్గ...
By Manda Ramkumar 2026-03-27 12:43:18 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com