ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

0
47

ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

అనంత భూమి, మార్కాపురం :ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో జేసీతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి రైతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని తమకు కావలసిన ఎరువులను తెచ్చుకోవచ్చునన్నారు.

వ్యాపారులు ఎవరైనా రైతులకు కావలసిన ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను పక్కదారి పట్టించినా, వివిధ రకాల ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనివల్ల రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం, బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందన్నారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులు అన్నీ కూడా యాప్ ద్వారా ఆర్ఎస్‌కేలు, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇప్పటివరకు 1.17 లక్షల మంది రైతులు యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 244
Andhra Pradesh
వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేసిన సునీత
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో...
By Pagadala Venkateswar 2026-01-13 07:45:10 0 185
Telangana
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2026-01-23 12:50:14 0 195
Telangana
అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ అవాజ్ ప్రతినిధి) తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న ప్రమాదాల మృతుల...
By Sidhu Maroju 2026-01-20 06:40:44 0 233
Telangana
అల్వాల్ పోలీసుల నిఘానేత్రం - నేరాల నియంత్రణే లక్ష్యం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-01-30 17:19:18 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com