షాబాద్ కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి.|

6
898

"పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం"

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13: షాబాద్‌లో సంచలనం సృష్టించిన పోక్సో, ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. 

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో సోమవారం అతని మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సమీపంలో పాయిజన్ బాటిల్ లభ్యమవడంతో, ప్రాథమికంగా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాజ్‌కుమార్ మేనమామ స్వగ్రామం పంజర్లగా స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

#Sidhumaroju

Angry
1
Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..
మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన  లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను...
By Bonagiri RaviShankar 2026-06-20 14:44:02 0 161
Andhra Pradesh
పోలవరం నిర్వాసిత గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలు త్వరగా ఇవ్వాలి!
పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం...
By Shyamala Yadagiri 2026-05-14 16:38:37 0 183
Andhra Pradesh
మంగళం లో రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర...
By Kothuru Murali 2026-01-02 13:06:01 0 183
Andhra Pradesh
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా...
By Hari Krishna 2025-12-21 09:14:39 0 263
Business & Finance
Collateral-Free Loans Make Business Funding Easier
Collateral-free loans provide businesses with access to funds without requiring property or other...
By Navya Sree 2026-07-20 05:59:18 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com