న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ

0
56

“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ

దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న షైదా మౌలా లా కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “న్యా వెరా” – మహిళల ఐక్యత, భద్రత, సాధికారత న్యాయ అవగాహనా సదస్సులో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ అల్లాబక్షు, దర్శి ఎస్‌ఐ జి. ఏడుకొండలు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ భద్రత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ చట్టాలు, సంబంధిత ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టంపై అవగాహన ప్రతి మహిళకు అవసరమని తెలిపారు.

విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజంలో వారి మాటకు మరింత విలువ ఉంటుందని పేర్కొన్నారు.

అదేవిధంగా మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు లేదా నేరాలకు గురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులను ధైర్యంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు...!
కరీంనగర్ లోని వావిలాలపల్లిలో  సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద...
By Sunka Santhosh 2026-06-20 13:38:27 0 153
SURAKSHA
Karnataka Cops Today: Mentors For Future Officers
oday senior and retired Karnataka police officers mentored new recruits. At training centers,...
By Kalaga Sailaja 2026-07-04 06:50:57 0 38
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:15:19 0 161
Telangana
బోయిన్‌పల్లిలో కళ్లజోళ్ల దుకాణంలో అగ్ని ప్రమాదం.|
సికింద్రాబాద్‌ : బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-03-28 09:30:05 0 166
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...
By Kothuru Murali 2026-05-02 05:43:48 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com