రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్లు

1
67

రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు

ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో గంటావానిపల్లిలో చేపట్టిన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత, ఐఏఎస్., జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గార్లు పరిశీలించి, సభా ప్రాంగణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

హెలిప్యాడ్ ప్రాంతం, వీఐపీల వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొత్తం 400 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, రెవెన్యూ అధికారులు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు, వై.పాలెం ఇన్‌స్పెక్టర్ కె. అజయ్ కుమార్, త్రిపురాంతకం సీఐ అసన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Pankaj Joshi, IAS: Steering Gujarat with Vision & Excellence
The Journey Begins "Good governance is not merely about administration—it is about...
By Fathima Safa 2026-07-20 06:35:11 0 34
Andhra Pradesh
మహిళల భద్రతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యం టిడిపి రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-06-02 07:56:08 0 153
Andhra Pradesh
పుంగునూరు :పుగునూరు పట్టణం లో పరవళ్ళు తొక్కిన కృష్ణమ్మ
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు...
By Kothuru Murali 2026-02-11 08:50:50 0 156
Andhra Pradesh
ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ...
By Pagadala Venkateswar 2026-04-16 03:18:34 0 131
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com