నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!

0
82

ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక

దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. జూన్ 4వ తేదీన ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని, శనివారం నుంచి సోమవారం లోపు ఇవి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

 

సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఇప్పటికే కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, గోవాలోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించగా, అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. జూన్ 6 నుంచి 8 మధ్య రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించని పక్షంలో వారం రోజుల వరకు ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 10వ తేదీ నాటికి ఇవి రాష్ట్రాన్ని తాకి, 15వ తేదీ నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథకుమార్ పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
V N Mobiles company donates franklin ev scooter to t t d
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*   తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన...
By G k Nookala 2026-04-23 12:58:48 0 156
Bihar
Bihar Strengthens Women and Child Welfare Initiatives
Bihar continues to expand women and child welfare initiatives through programs focused on...
By Fathima Safa 2026-07-03 14:47:21 0 33
Andhra Pradesh
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
  ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన...
By Pagadala Venkateswar 2026-06-06 06:09:07 0 83
Andhra Pradesh
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక...
By Chennaiah Kati 2026-02-08 04:04:14 0 238
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-08 13:24:57 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com