కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు

0
1K

ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా...

ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం జరగాలి

ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఆయన సొంతం

మహబూబాబాద్, మే 26:​​ఒక సాధారణ పల్లెటూరిలో, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల గొంతుకగా మారడం వెనుక ఒక గొప్ప సంకల్పం, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆయనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వట్టం ఉపేందర్. ఇటీవల ఆయన ‘తుడుందెబ్బ’ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, కార్యకర్త స్థాయి నుండి దేశస్థాయికి ఎదిగిన ఒక అరుదైన మైలురాయిని అధిరోహించారు. ​వట్టం ఉపేందర్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే, అది నేటి తరం యువతకు, సామాజిక కార్యకర్తలకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.స్వగ్రామంలో సామాజిక చైతన్యం (తొలి అడుగులు)​గోపాలపురం గ్రామంలోని ‘చైతన్య యువజన సంఘం’ ద్వారా ఉపేందర్ తన సామాజిక సేవా రంగాన్ని ప్రారంభించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం, గ్రామంలోని యువతను చైతన్యపరచడం కోసం ఆయన చేసిన పనులు ఆయనలోని నాయకత్వ లక్షణాలను తొలిసారిగా బయటకు తీశాయి. 

అంచెలంచెలుగా ‘తుడుందెబ్బ’ ప్రస్థానం


​ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే ‘తుడుందెబ్బ’ (ఆదివాసి హక్కుల పోరాట సమితి) సంఘంలో ఆయన ఒక సాధారణ కార్యకర్తగా చేరారు. పదునైన వాగ్ధాటి, అంకితభావం, గిరిజన సమస్యలపై ఉన్న అవగాహన ఆయనను ఆనతి కాలంలోనే ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాయి.
​ఆనాడు స్థానిక గిరిజనుల భూ సమస్యలు, అడవిపై హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పోరాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివాసీ యువతను ఏకం చేసి సంఘాన్ని బలోపేతం చేశారు. తెలంగాణవ్యాప్తంగా పోడు భూముల సమస్య, 1/70 చట్టం అమలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

బ్రహ్మరథం పట్టిన గ్రామస్థులు

తుడుందెబ్బ (ఆదివాసి హక్కుల పోరాట సమితి) జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన వట్టం ఉపేందర్‌కు ఆయన స్వగ్రామంలో గ్రామస్తులు, గిరిజన నాయకులు బ్రహ్మరథం పట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి ఆయన తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా మంగళవారం ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది.

కార్యకర్త స్థాయి నుండి దేశస్థాయికి..

​ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో పుట్టి పెరిగిన వట్టం ఉపేందర్, ఇక్కడి ‘చైతన్య యువజన సంఘం’ ద్వారా సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టారని గుర్తుచేసుకున్నారు. తుడుందెబ్బ సంఘంలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన నిబద్ధత, నిరంతర శ్రమ, నాయకత్వ పటిమతో మండల, జిల్లా, రాష్ట్ర అధ్యక్షుడిగా... ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు.
​ఉపేందర్ సారథ్యంలో తుడుందెబ్బ సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఎంతో బలోపేతమైందని, ఆదివాసీల హక్కుల కోసం ఎన్నో వీరోచిత పోరాటాలు సాగాయని వారు పేర్కొన్నారు. నేడు ఆయన జాతీయ స్థాయి అత్యున్నత పదవికి ఎన్నిక కావడం గోపాలపురం గ్రామ కీర్తి ప్రతిష్టలను దేశస్థాయికి తీసుకెళ్లిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆత్మీయ సత్కారం

​స్వగ్రామానికి చేరుకున్న వట్టం ఉపేందర్‌కు మహిళలు, యువకులు ఆదివాసీ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆదివాసీ హక్కుల పోరాటంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.వట్టం ఉపేందర్ ఎదుగుదల.. కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు, అది క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసే ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆదివాసీల, గిరిజనుల హక్కుల పోరాటంలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల అధ్యక్షులు పూనెం సందీప్ అన్నారు.ఈ ఘన సన్మాన కార్యక్రమంలో గ్రామ దొర పటేళ్లు వాసం భద్రయ్య, పూనేం రామస్వామి, తురస భద్రయ్యలతో పాటు స్థానిక సర్పంచ్ వట్టం శ్రీను బాబు, పూనెం లక్ష్మి నర్సు, గ్రామ పెద్దలు, చైతన్య యువజన సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
SKY ROOT AEROSPACE VIKRAM 1 Rocket flag off ceremony
స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు Revanth Reddy స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో...
By G k Nookala 2026-04-25 10:20:47 0 178
Andhra Pradesh
దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...
By Kothuru Murali 2026-01-09 12:42:41 0 186
Andhra Pradesh
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-01 12:11:56 0 270
Telangana
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్ ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం...
By Pinnehasan Odela 2026-01-16 09:23:30 0 317
Goa
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement Artificial Intelligence (AI) is no...
By BMA ADMIN 2025-05-21 09:27:54 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com