"మీ బండి కూడా ఉందా..? 446 వాహనాల జాబితా విడుదల చేసిన పోలీసులు”|

0
133

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీధుల్లో వదిలివేయబడిన వాహనాలపై పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు.

మొత్తం 446 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని త్వరలో వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఫోర్ వీలర్లు, త్రీ వీలర్లు, టూ వీలర్లు ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న వాహనాలను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్, అంబర్‌పేట్‌లో భద్రపరిచారు. అలాగే ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఫోర్ వీలర్, త్రీ వీలర్ వాహనాలను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పూలింగ్ పాయింట్‌లో ఉంచారు.

సంబంధిత చట్టాల ప్రకారం ఈ వాహనాలను వేలం వేయాలని మల్కాజిగిరి పోలీసులు నిర్ణయించారు.

వాహనాల పూర్తి వివరాలను మల్కాజిగిరి పోలీస్ అధికారిక వెబ్‌సైట్ లో “Citizen Services – Abandoned Vehicles – 2026” విభాగంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తమ వాహనం అందులో ఉందేమో యజమానులు పరిశీలించుకోవాలని సూచించారు.

వాహనాలకు సంబంధించిన యజమానులు లేదా హైపోతెకేషన్ వ్యక్తులు తగిన పత్రాలతో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఆరు నెలల లోపు DCP CAR Headquarters, మల్కాజిగిరి, అంబర్‌పేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

 ఆధారాలు పరిశీలించిన అనంతరం వాహనాలను యజమానులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 8008338535, 8712662661 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దారవీడు మండలం బద్వేడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య
పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య   దోర్నాల...
By Chennaiah Kati 2026-01-23 14:02:03 0 210
Telangana
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ...
By Sidhu Maroju 2026-03-31 07:55:27 0 176
Uttarkhand
Kedarnath Yatra Resumes While Search Continues for Missing Hiker
Following a brief temporary suspension due to severe weather and fresh snowfall in the upper...
By Tejaswini Komanduru 2026-06-05 09:01:35 0 598
Andhra Pradesh
పుంగనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ...
By Kothuru Murali 2026-03-20 06:32:10 0 158
Andhra Pradesh
10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన...
By Pagadala Venkateswar 2026-05-04 09:39:11 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com