కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.

0
189

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్ 

అసిఫాబాద్:భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో.గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు.రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉగ్రవాద వెతిరేక దినంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు.ఆత్రం సుగుణక్క గారితో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్.గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.దేశానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను సాంకేతిక రంగంలో ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆసుపత్రి సిబ్బందికి కాంగ్రెస్ నాయకులు పండ్లను పంపిణీ చేశారు.రోగుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్. ఏఎంసి చైర్మన్ మంగ.మాజీ మండల అధ్యక్షుడు బాలేశ్వర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తారీక్. భీంరావ్. ప్రధాన కార్యదర్శి గాదెవేని మల్లేష్. మున్సిపల్ కౌన్సిలర్లు వైరాగడ గోవింద్.జాడి వినోద్.సాయి.నిఖిల్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జక్కన్న.మారుతి పటేల్. మాజీ ఎంపిటీసి సిడం తిరుపతి.కలిం.రాపర్తి మురళి.పి బాలు. మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. పార్టీ కార్యకర్తలు.పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com