ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు VGA దయాసాగర్ గారు మాట్లాడుతూ కొందరు టిడిపి నాయకులు విషయాలు తెలుసుకోకుండా నందవరం మండల బిజెపి నాయకులు గురురాజు దేశాయి గారి మీద కొందరు టిడిపి నాయకులు ఆయన వ్యక్తిగతల విషయాలపై వ్యాపారాల విషయాలపై సోషల్ మీడియాల ద్వారా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దూషించడం సరైన చర్య కాదని వారిపై పరువు నష్టధావం వేస్తామని ఈ విధంగా చేయడం సరైన భవ్యం కాదని ఆయన తెలియజేశారు.
అలాగే బిజెపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బి.ఎల్.నారాయణ గారు మాట్లాడుతూ కూటమిలో బిజెపి నాయకులను మీరు వ్యక్తిగతంగా అవమానపరచడం తగిన చర్య కాదని ఆయన తెలియజేశారు. బిజెపి పార్టీ కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం లో బలంగా ఉందని కూటమిలో ఉన్నందుకే సమన్వయంతో ఉన్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు కురువ బడేసాబ్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పర రామ్ చరణ్ తేజ్ ,పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు వన్నెల బాలాజీ ,వెల్డింగ్ వెంకటేష్, నాగరాజు యాదవ్, గాంధీనగర్ అయ్యా పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz