జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి

0
63

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాల ను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో tuwj iju యూనియన్, జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజేటి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అన్ని మండలాలలో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో యూనియన్ సభ్యత్వం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని యూనియన్ ప్రతినిధులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు జర్నలిస్టుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు యూనియన్ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో ఐజేయు యూనియన్ జిల్లా ప్రతినిధులు మల్లం వెంకటేశ్వర్లు,కొడారు బ్రహ్మం, దొడ్డ శ్రీధర్, ప్రెస్ క్లబ్ సభ్యులు గోవిందా చారి, సిద్దెల శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: టిప్పు సుల్తాన్ మైదాన అభివృద్ధి పనుల పరిశీలన.
మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా...
By Pagadala Venkateswar 2026-05-14 14:33:48 0 63
Andhra Pradesh
వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో ఆర్డిఓ అనిల్ కుమార్
నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్...
By Patan Khuddus 2026-05-07 11:00:28 0 202
Andhra Pradesh
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ అక్రమ గంజాయి పట్టివేత
గుంటూరు జిల్లా పోలీస్...* *నగరం పాలెం పోలీస్ స్టేషన్.* *తేది : 22.12.2025* _*//గంజాయి కేసులో...
By KOTESWARARAO KVSR 2025-12-23 13:59:12 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com