భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర

0
258

బాపట్ల, 

సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా కలెక్టర్‌కు ఓ రైతు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో సక్రమంగా ఉన్న భూమి, ఆన్‌లైన్ రికార్డులకు వచ్చేసరికి గందరగోళంగా మారిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా అన్నం బోట్లవారి పాలెం గ్రామానికి చెందిన రైతు తూబాటి శివకోటేశ్వరరావుకు గ్రామంలోని సర్వే నంబర్ 213 సి లో 1 ఎకరం 39 సెంట్ల మెట్ట భూమి ఉంది. రిజిస్టర్ రికార్డుల ప్రకారం ఈ భూమి ఆయన పేరు మీదే ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్ ) రికార్డుల్లో మాత్రం తప్పుగా నమోదైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సర్వే నంబర్ 213 ఎ లో 0.39 సెంట్లు మీద, 213 బి లో 0.39 సెంట్లు మీద ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని, అయితే తన రికార్డుల్లో ఉండాల్సిన 1.39 ఎకరాలకు గాను కేవలం 0.68 సెంట్లు మాత్రమే చూపిస్తోందని బాధితుడు వివరించారు.

రికార్డుల తారుమారుని సాకుగా చూపి, కొంతమంది వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని శివకోటేశ్వరరావు ఆరోపించారు. తన పొలానికి పక్కనే ఉన్న చెన్నపాటి కోట సుబ్బారావు, చెన్నపాటి అంకమ్మ, చెన్నపాటి ధర్మ, ముక్కా శ్రీను తదితరులు గట్టు పంచాయితీలు సృష్టించి, మట్టి తోలుతూ తన భూమిని ఆక్రమించేందుకు అడ్డుపడుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించి తన భూమి రికార్డులను సరిచేసి, ఆక్రమణదారుల నుండి తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని ఆయన జిల్లా అధికారులను కోరారు.

Search
Categories
Read More
Telangana
"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. 08-04-2026...
By Sidhu Maroju 2026-04-08 15:09:26 0 264
Andhra Pradesh
Chandrababu Naidu: బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.
Andhra Chandrababu Distributes Pensions Door to Door in Beggi Palle కుప్పం నియోజకవర్గంలో రెండో...
By Pagadala Venkateswar 2026-01-31 10:36:55 0 156
Andhra Pradesh
సావిత్రిబాయి పూలే ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే...
By John Baji 2026-01-03 13:53:40 0 231
Andhra Pradesh
నో పెట్రోల్ .. నో హెల్మెట్ : కర్నూల్
కర్నూలు జిల్లా :  కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో...
By Hari Krishna 2025-12-25 07:55:48 0 213
Telangana
Telangana 10th results tomorrow
హైదరాబాద్‌: రేపు టెన్త్ ఫలితాల విడుదల తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు...
By G k Nookala 2026-04-28 08:52:42 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com