పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.

0
177

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.40HP సామర్థ్యం గల ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు , పవర్ స్ప్రేయర్లు వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరికరాలపై ప్రభుత్వం 40% నుండి 50% వరకు సబ్సిడీ అందిస్తోంది.ఆసక్తి గల రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.రైతులు తమ వివరాలను eseed.ap.gov.in/FM/Portal వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం లేదా దరఖాస్తు ప్రక్రియలో సహాయం కోసం రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను (VAA) సంప్రదించాలని అధికారులు కోరారు. ఆధునిక యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.

 

# Yadagiri 

 

Search
Categories
Read More
SURAKSHA
Proactive Disaster Management and Relief
​Content: During floods and other natural disasters, Karnataka Police has consistently displayed...
By Kalaga Sailaja 2026-06-29 11:34:29 0 62
Andhra Pradesh
విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్య జ్యోతి
*విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్యాజ్యోతి*   *విద్యాజ్యోతి ద్వారా విద్యార్థుల...
By Rajini Kumari 2026-01-09 10:23:03 0 188
Andhra Pradesh
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం -...
By Chennaiah Kati 2026-07-03 17:04:34 0 55
Business & Finance
Monsoon Rains Disrupt Trade and Transport in Manipur
Heavy monsoon rainfall across parts of Northeast India continues to affect transportation,...
By Navya Sree 2026-07-02 12:24:20 0 63
Andhra Pradesh
కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ
💐💐అందరికి నమస్కారం 🙏   ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని...
By Rajini Kumari 2025-12-18 10:02:44 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com